పోస్ట్‌లు

మే, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రశ్నార్ధకమవుతున్న న్యాయవ్యవస్ధ

" కులము గల్గువాడు , గోత్రంబు గల్గువాడు , విద్యచేత విర్రవీగువాడు పసిడి గల్గువాని బానిసకొడుకులు"  అన్నాడు వేమన్న!యెప్పుడు ? కొన్ని శతాబ్దాల క్రితం - బహుశా సహస్రాబ్దాలు కూడా దాటిపోయి ఉండొచ్చు!కానీ కొన్ని నిజాలు యుగాల తరబడి మళ్ళీ మళ్ళీ రుజువులతో సహా జరుగుతూనే ఉంటాయి  నేటి న్యాయ వ్యవస్థలో ఒక తీర్పు వెలువడ్డానికి , ఒక నేరం నిర్ధారించడానికి , కొన్నేళ్ల కాలం పడుతోంది. ఇందకోసం వందలాది పేజీల చార్జిషీట్ , బోలెడు ఫైళ్లు , మరెన్నో సాక్ష్యాలు , ఇంకెన్నో రుజువులు..వీటన్నింటి ఆలంబనగా ఏళ్ల తరబడి వాదనలు..అవన్నీ ముగిసాక , కిందా మీదా పడి కింద కోర్టు తీర్పు చెబుతుంది. కానీ అంతలోనే పై కోర్టు , కింది కోర్టు తీర్పును పక్కన పెడుతుంది లేదా కొట్టి వేస్తుంది కోర్టు కోర్టుకు తీర్పుమారితే , కోర్టుల్లో న్యాయం వున్నట్లా లేనట్లా ? మన న్యాయవ్యవస్థపై గౌరవం, భయం, భక్తీ అలాంటివి. అయితే రాను రాను వివిధ కేసుల్లో కోర్టులు ఇస్తున్న తీర్పులు చూస్తుంటే, ఈ భయమూ, భక్తి, గౌరవం ప్రశ్నార్థకమవుతున్నాయి అంటున్నారు అనుభవజ్ఞులైన కాలమిస్టులు. 18 ఏళ్లపాటు దిగువ కోర్టులో నలిగిన కేసు తీర్పు,  ఎనిమిది ...